వ్యవసాయ యాంత్రీకరణ, నూతన సాంకేతికత అందిపుచ్చుకునేందుకు యువ రైతులు ముందుకురావాలని పిలుపునిచ్చిన పొన్నూరు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు
పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో లబ్ధిదారులకు వ్యవసాయ డ్రోన్ పంపిణీ చేయడం జరిగింది.

9.80 లక్షల విలువ గల వ్యవసాయ డ్రోన్ పొందేందుకు బ్యాంకు ఋణ సదుపాయం పొంది మరియు రైతువాటా చెల్లించిన
👉చేబ్రోలు మండలం, వేజండ్ల గ్రామ శ్రీ వరసిద్ధి వినాయక కిసాన్ డ్రోన్ సి.హెచ్.సి గ్రూప్- వేజండ్ల , డి వెంకటేసులు మరియు అతని గ్రూప్ సభ్యులకు,
👉పొన్నూరు మండలం మాచవరం గ్రామం శ్రీ వెంకటేశ్వర కిసాన్ డ్రోన్ సి.హెచ్.సి గ్రూప్ – మాచవరం , వేజెండ్ల చంద్రశేఖర్ మరియు అతని గ్రూప్ సభ్యులకు,
👉పొన్నూరు మండలం సీతారామపురం గ్రామం N.T.R కిసాన్ డ్రోన్ F.M.B గ్రూప్ జరుగుమల్లి అవినాష్ అతని గ్రూప్ సభ్యులకి,
వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి పార్టీల నాయకులతో కలసి “కిసాన్ డ్రోన్” (డ్రాగో డ్రోన్స్ క్రిషి 3 ప్రో ) అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు వారు మాట్లాడుతూ :-
✅నూతన సాంకేతికత, వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా రైతులకు సమయాన్ని, ఖర్చులను తగ్గించేందుకు ప్రభుత్వం చూపుతున్న చొరవ ప్రోత్సాహం రైతులు, యువ రైతులు ఉపయోగించుకోవాలి.
✅ప్రభుత్వం తలపెట్టిన వ్యవసాయ యాంత్రీకరణలో బాగస్వామ్యమై నూతన సాంకేతికను అందిపుచ్చుకునేందుకు ముందడుగు వేసిన యువ రైతుల బృందానికి అభినందనలు
✅ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ ప్రోత్సాహం నిమిత్తం 80% ( దాదాపు 7.84 లక్షలు) సబ్సిడీ వ్యవసాయ శాఖ నుండి సహకారం అందిస్తుంది.
✅డ్రోన్ టెక్నాలజీతో రైతులకు అండగా నిలవాలని, వ్యవసాయాన్ని సులువుగా, లాభదాయకంగా మార్చేదిశగా రైతులను ప్రోత్సహించాలనే కూటమి ప్రభుత్వం లక్ష్యానికి తొలి అడుగులు
✅రాష్ట్ర వ్యాప్తంగా 800 గ్రామస్థాయి కిసాన్ సమైక్యలను ఏర్పాటు చేసి రైతులకు డ్రోన్స్ అందించేలా చర్యలు చేపట్టిన ప్రభుత్వం
✅కావున రైతు బృందాలు, రైతు సంఘాలు ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నాను.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి ప్రభుత్వం నాయకులు మరియు కార్యకర్తలు, పాల్గొన్నారు.


























