
ప్రసిద్ధ నటుడు మరియు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ ఇటీవల డా. ఎం.ఎస్. స్వామినాథన్ జీవితం ఆధారంగా రాసిన పుస్తకం “M.S. Swaminathan – The Man Who Fed India” ను ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిత ప్రియంబద జయకుమార్ రాశారు. ఈ పుస్తకం డా. స్వామినాథన్ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలను, ఆయన భారతీయ వ్యవసాయం మరియు ఆహార భద్రతలో చేసిన కృషిని వివరంగా ప్రతిబింబిస్తుంది.
డా. స్వామినాథన్, “హరిత విప్లవం” (Green Revolution) కు పితామహుడిగా గుర్తించబడ్డాడు. ఆయన నేతృత్వంలో భారతదేశంలో సేంద్రియ మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులను ప్రవేశపెట్టడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి విప్లవాత్మకంగా పెరిగింది. ఈ పుస్తకం ద్వారా ఆయన రైతుల సంక్షేమం, ఆహార భద్రత, మరియు గ్రామీణ అభివృద్ధికి చేసిన సేవలు స్పష్టంగా తెలియజేస్తుంది.
పుస్తకావిష్కరణ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ, “డా. స్వామినాథన్ గారి జీవితము ప్రతి భారతీయుడికి ప్రేరణ. ఆయన రైతుల కోసం చేసిన కృషి, ఆహార భద్రత కోసం ఆయన చేసిన సేవలు స్మరణీయమైనవి,” అని పేర్కొన్నారు. డా. స్వామినాథన్ సాధించిన విజయాలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా ఉంటాయని అన్నారు.
రచయిత ప్రియంబద జయకుమార్ మాట్లాడుతూ, “డా. స్వామినాథన్ జీవితం మరియు కృషి ప్రతి భారతీయుడికి నేర్చుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ఆయన పద్దతులు, పరిశోధనలు మరియు వ్యవసాయలో ఆవిష్కరణల ద్వారా దేశానికి అందించిన కృషిని ఈ పుస్తకంలో వివరించాం, నిజంగా ఇది ఎం.ఎస్. స్వామినాథన్ కథ. అయన కలగన్న ఆశ, స్థితిస్థాపకత కలిగిన భారతదేశం కథ ” అని తెలిపారు. పుస్తకం చదివినవారు భారతీయ వ్యవసాయం, రైతుల పరిస్థితులు, మరియు ఆహార భద్రతలో డా. స్వామినాథన్ పాత్రను మరింత దగ్గరగా అర్థం చేసుకోగలుగుతారు.
Leave Your Comments


























