Akula Amaraiah: పత్రికా రంగంలో అత్యుత్తమ సేవలందించిన జర్నలిస్టులకు ఆయా సంస్థల ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డులు, ఉత్తమ రిపోర్టింగ్ అవార్డులు ఇలా పలు కేటగిరీల్లో అవార్డులు ప్రధానం చేస్తుంటారు. 2021 ఉత్తమ రిపోర్టింగ్ అవార్డుకు గానూ సాక్షి దినపత్రిక వ్యవసాయ రంగ విభాగపు చీఫ్ గా ,జర్నలిస్ట్ ఉద్యమ నేతగా వారు పత్రికా లోకానికి సుపరిచితులైన ఆకుల అమరయ్య ఎన్నికయ్యారు. ఈ మేరకు హైబిజ్ టీవీ మీడియా ఆధ్వర్యంలో ఉత్తమ రిపోర్టింగ్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాదు హైటెక్స్ లోని నోవాటెల్ హోటల్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల కే. తారకరామారావు హాజరయ్యారు.

Akula Amaraiah
2021 ఉత్తమ రిపోర్టింగ్ అవార్డు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా సీనియర్ జర్నలిస్టు అమరయ్య ఆకుల అందుకున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల ప్లాటినం జూబ్లీ పురస్కరించుకుని తీసుకు వచ్చిన వెలుతురు తోవలు, వెలుగుపూలు,చివరగా వస్తున్న వెలుగు దివ్వెలు కు అమరయ్య గారు అందించిన,అందిస్తున్న సేవలకు ఈ అవార్డు దక్కింది. అదేకాకుండా పత్రికారంగంలో ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆ సేవలను మంత్రి కేటీఆర్ కొనియాడారు. సాక్షి దినపత్రిక వ్యవసాయ రంగ విభాగపు చీఫ్ గా ,జర్నలిస్ట్ ఉద్యమ నేతగా వారు పత్రికా లోకానికి పరిచయస్తులు. కావున ఆకుల అమరయ్య ఈ అవార్డు అందుకోవడం పురస్కారానికి విలువ పెరిగిందని అభిప్రాయపడ్డారు. అమరయ్యకు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఐవి సుబ్బారావు స్మారక కమిటీ తరపున అభినందనలు తెలియజేశారు.


























