- పీఎం ప్రమాణ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని చంద్రబాబు సూచించారు.
- ఏపీలో యూరియా కొరత లేదు… అవసరమైతే డోర్ డెలివరీ చేద్దాం.
- నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలి.
- అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి.
- గోశాలల నిర్మాణంతో పశుసంపద రాష్ట్రానికి రిటన్ గిఫ్ట్ ఇస్తోంది.
- జీఎస్డీపీ వృద్ధిలో లైవ్ స్టాక్ పాత్ర కీలకంగా ఉంది.
- పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుంది.
- దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేస్తే వారికి మంచి ఆదాయం వచ్చేలా చేయగలం.
- అర్బన్ ఏరియాలో రెండు సెంట్లు, రూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఇవ్వాలి.
- అర్బన్ ప్రాంతాల్లో భూ లభ్యత లేకుంటే గ్రూప్ హౌసింగ్ విధానాన్ని అవలంభించాలి.
- సెంట్ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపకపోతే… ఆ భూమిని పరిశ్రమలకు కేటాయించాలని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.
- సెంట్ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపని లబ్ధిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ఉచిత ఇళ్ల పట్టాల పథకంలో చోటు కల్పించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
- ఏపీలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్ ఉంది. రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.
- రాయితీ విద్యుత్ అందించేందుకు జోన్, నాన్ జోన్ కింద విభజించారు.
- నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి రూ. 1.50కు యూనిట్ విద్యుత్ అందివ్వాలి.
- ఆక్వా ఉత్పత్తులకు ట్రేసబులిటీ, సర్టిఫికేషన్ కంపల్సరీ.
- ఆక్వా కల్చర్ను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.
- పౌల్ట్రీ వేస్ట్ ఇష్టానుసారంగా పడేయకుండా చూసుకోవాలి.
- వ్యవసాయం చాలా ముఖ్యం. వ్యవసాయంలో 35శాతం గ్రోత్ రేట్ ఉంది.
- సమస్యలను ఇప్పుడు మ్యానేజ్ చేయలేకపోతున్నారు.
- యూరియా వచ్చినప్పుడు దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసి పంపిణీ చేస్తే అది సమస్యనే కాదు.
- ఏ రైతుకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి… నేను ఇచ్చిన ఐడియా అనుగుణంగా యూరియాపై ప్రయత్నించాలి.
- సర్వీస్ సెక్టార్ను కూడా బాగా మేనేజ్ చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
- ప్రాథమిక, పరిశ్రమలు, సేవల రంగాలపైనా సీఎం చంద్రబాబు సమీక్షించారు.
- జీఎస్డీపీ పెంపునకు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలని సూచించారు.
- ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గిస్తే మంచిదని సూచించారు.
- యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సహాకాలు ప్రకటించారు.
- విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
- మైక్రో ఇరిగేషన్పై 30 ఏళ్లకు ముందు దివంగత మాజీ ప్రధానమంత్రి వాజ్పేయికు రిపోర్టు ఇచ్చానని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.
- దీంతో 90 శాతం మైక్రో ఇరిగేషన్ మనకు ఇచ్చారు.
- కాఫీ పంటలో పెప్పర్ కూడా అంతర పంటగా వేయించాం.
- కాఫీ కన్నా పెప్పర్ ఆదాయం ఎక్కువ ఉంది.
- ఉల్లిపాయల విషయంలో వైసీపీ ఎన్నో డ్రామాలు ఆడుతోంది. ఉల్లిపాయలకు ఇప్పుడు రూ.12లు తగ్గకుండా చూడాలని చెప్పాం. కొన్ని సీజన్లలో ఇబ్బందులు వచ్చినా కల్టివేషన్ ప్లస్ వస్తే చాలు.
- ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్కు ఓ సెక్రటరీనే ఉంచాం.
- హర్టీకల్చర్పై లక్షా 70 వేల కోట్ల రూపాయల జీఎస్డీపీ వస్తోంది.
- హస్బెండరీ ఓ గేమ్ చేంజర్. ఇది పేదవాళ్లను ఎంపవర్ చేయగలిగే స్కీమ్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Leave Your Comments


























