వార్తలు

రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్…

0
PM Kisan Yojana

Good News For Farmers From PM Kisan Yojana ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా రైతుల ఖాతాలకు రూ.22,000 కోట్లు విడుదల చేసేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ పథకం కింద రైతుల కుటుంబాలకు కేంద్రం దాదాపు రూ.1.57 లక్షల కోట్ల మొత్తాన్ని అందించింది. నివేదికల ప్రకారం ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి యోజన10వ విడతను డిసెంబర్ 15 నుండి 25 మధ్య విడుదల చేస్తుంది. రైతు కుటుంబాలను ఆదుకునేందుకు 2022 ఆర్థిక సంవత్సరంలో పీఎం కిసాన్ పథకం కోసం కేంద్రం ఇప్పటివరకు రూ. 43,000 కోట్లు ఖర్చు చేసిందని ప్రభుత్వం వర్గాలు తెలియజేశాయి.

PM Kisan Yojana

కాగా.. ప్రస్తుతం ఎక్కువ మంది వినియోగదారులు ఈ స్కీమ్ కోసం నమోదు చేసుకుంటున్నందున పీఎం కిసాన్ కోసం అదనంగా రూ.65,000 కోట్ల అవసరం పడనుంది. పశ్చిమ బెంగాల్‌లో ఈ పథకం కింద మరో 15 లక్షల మంది రైతులను చేర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 35 లక్షల మంది రైతులు ఉండగా, ఆ సంఖ్య 50 లక్షల వరకు ఉంటుంది. పీఎం కిసాన్ పథకానికి ఈ ఏడాది 11 కోట్ల మంది లబ్ధిదారులను ప్రభుత్వం చేర్చింది.PM Kisan Yojana

PM Kisan Yojana

ఈ ఏడాది ఆగస్టులో, ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద 9.75 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దాదాపు రూ.19,500 కోట్లను బదిలీ చేశారు. ప్రధానమంత్రి సమక్షంలో వర్చువల్ ఈవెంట్‌లలో దేశాన్ని ఉద్దేశించి వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, 9వ విడత కంటే ముందు, ఈ పథకం కింద సుమారు 11 కోట్ల మంది లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం రూ. 1.37 లక్షల కోట్లు పంపిణీ చేసిందని చెప్పారు. ప్రభుత్వం 2.28 కోట్ల పీఎం కిసాన్ లబ్ధిదారులను కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌తో లింక్ చేసింది, దీని కింద వారు ఇప్పటివరకు రూ. 2.37 లక్షల వరకు రుణాన్ని పొందగలిగారు. కోవిడ్-19 సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ రైతులు కష్టపడి పనిచేశారని, గత ఏడాది బంపర్ ఉత్పత్తిని సాధించారని ఆయన చెప్పారు. రైతుల నిరంతర ప్రయత్నాల వల్ల రాబోయే రోజుల్లో మెరుగైన ఉత్పత్తి కూడా ఉంటుందని నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు.

PM Kisan Yojana

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆరు వేల రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అర్హత గల ప్రతి రైతు ఖాతాలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున జమ చేస్తుంది. Modi

Leave Your Comments

శీతల ఫలం ”సీతా ఫలం” … గర్భిణీ స్త్రీలకు వరప్రదం

Previous article

ఐదవ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్ర కాంగ్రెస్ సదస్సు 3వ రోజు

Next article

You may also like