జాతీయంవార్తలు

Poisonous Mushrooms: మనుషుల ప్రాణాలు తీస్తున్న పుట్టగొడుగులు

0
Poisonous Mushrooms

Poisonous Mushrooms: దుకాణాల్లో పుట్టగొడుగులు కొనే బదులుగా కొందరు అడవి నుంచి వాటిని తెచ్చుకుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే చాలాసార్లు విషపూరిత పుట్టగొడుగులు తిని చనిపోయారనే వార్తలు మనం వింటుంటాం.. ఇటీవల అస్సాంలో ఇలాంటి ఘటనే జరిగింది. విషపూరిత పుట్టగొడుగులు తిని అక్కడ స్థానికులు చనిపోయారు.. రాజేష్ ఖరియా ఏప్రిల్ 8న తన ఇంటి సమీపంలోని అడవి నుండి అడవి పుట్టగొడుగులను సేకరించాడు. అస్సాంలోని దిబ్రూఘర్ జిల్లాలో అతను పనిచేసే టీ ఎస్టేట్‌కు దగ్గరగా ఉంది. అడవి నుండి అడవి పుట్టగొడుగులను సేకరించి కొంత మేర తన కుటుంబ అవసరాల కోసం ఉంచుకుని మిగతాది స్థానిక ఇరుగుపొరుగు వారికి ఇచ్చాడు. మరుసటి రోజు ఖరియాతో సహా 11 మంది వ్యక్తులు ఆసుపత్రిలో చేరారు. వారిలో ఇద్దరు ఏప్రిల్ 11న మరణించారు: ఖరియా యొక్క ఆరేళ్ల మనవరాలు మరియు అతని పక్కింటి పొరుగున ఉన్న సైన్ లామా. లామా భార్య మరుసటి రోజు మరణించింది.

Poisonous Mushrooms

పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మరణానికి దారితీస్తుందని నేను నమ్మలేకపోతున్నాను అని రాజేష్ ఖరియా కుమార్తె అంజలి ఖరియా చెప్పారు. కొన్నేళ్లుగా టీ తోటల నుంచి పుట్టగొడుగులను సేకరించి తింటున్నామని ఆమె పేర్కొంది. ప్రజలు చనిపోయే ప్రమాదాల గురించి మాకు తెలిస్తే మేము ఎప్పుడూ అడవి పుట్టగొడుగులను తినము అని ఆమె పేర్కొంది. అస్సాంలో ప్రధానంగా ఎగువ అస్సాం ప్రాంతాల్లో అడవి పుట్టగొడుగులను తినడం వల్ల ఏప్రిల్‌లో 16 మంది వ్యక్తులు మరణించారు. ఇంకా పుట్టగొడుగులను తిన్న తరువాత, ఎగువ అస్సాం నుండి 39 మంది మరియు డిమా హసావో నుండి ఆరుగురు ఆసుపత్రి పాలయ్యారు.

Poisonous Mushrooms

దిబ్రూఘర్ డిప్యూటీ కమిషనర్ బిస్వజిత్ చెప్పిన వివరాల ప్రకారం మరణించిన వారిలో ఎక్కువ మంది టీ తోట కార్మికుల కుటుంబాలకు చెందినవారు. ఈ మరణాలకు అనేక కారణాలను ఉండవచ్చు. రోజువారి ఆదాయం పెరగాలని టీ తోట కూలీలు ఏళ్ల తరబడి ఆందోళనలు చేస్తున్నారు. గత సంవత్సరం బ్రహ్మపుత్ర లోయలో కార్మికులకు ప్రభుత్వం రూ. 205కి పెంచింది, మొదట అడిగిన రూ. 351 నుండి గణనీయంగా తగ్గింది. బరాక్ లోయలో రోజువారీ కూలీ రూ. 183. ప్రైవేట్ టీ ఎస్టేట్‌లలోని కార్మికులకు చాలా తక్కువ వేతనం లభిస్తుంది. ఇటీవలి కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో తేయాకు కార్మికులు అడవి కూరగాయలు తినాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు కూరగాయల కొనుగోళ్లకు స్వస్తి చెప్పారు అని పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యవసాయ అధికారి ఒకరు తెలిపారు. ఈ పుట్టగొడుగు తినదగినది కాదని .. అందులో విషపూరిత పదార్థాలు ఉన్నాయని చెప్పారు. హానికరమైన అడవి పుట్టగొడుగుల వినియోగం గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో చాలా మంది తేయాకు తోటల కార్మికులు ప్రభుత్వ సహాయ కార్యక్రమాల నుండి ప్రయోజనం పొందలేదు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా అందజేసే ఉచిత ప్రభుత్వ బియ్యం తన కుటుంబానికి అందడం లేదని అంజలి ఖరియా పేర్కొన్నారు. మాకు ఎటువంటి సహాయం అందించబడలేదని ఆమె పేర్కొంది. పుట్టగొడుగుల మరణాల తరువాత అధికారులు మా ఇంటికి వచ్చారని ఆమె తెలిపింది.

Leave Your Comments

Black Raisin: నల్ల ఎండు ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

Previous article

Palmarosa cultivation: పామరోసా సాగులో మెళుకువలు

Next article

You may also like