- 3 ఎకరాల వరకు రైతు భరోసా నిధుల జమ
- ఈ రోజు 1551.89 కోట్లు విడుదల
ఈ రోజు 3 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా నిధుల జమ చేయడం జరిగిందని, అందుకోసం 1551.89 కోట్లు విడుదల చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు తెలిపారు. 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఈ సందర్భంగా మంత్రిగారు పేర్కొన్నారు.
Leave Your Comments


























