వార్తలు

ప్రాజెక్టులకు రూ.2,071 కోట్ల పంపిణీ

0
Narendra Singh Tomar

Centre disburses Rs 2071cr loan for 4,000 odd projects వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద ప్రభుత్వం ఇప్పటివరకు 4,003 ప్రాజెక్టులకు రూ.2,071 కోట్లు పంపిణీ చేసిందని వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం లోకసభలో తెలిపారు. 6,098 కోట్ల రుణంతో ఇప్పటివరకు మొత్తం 8,488 ప్రాజెక్టులకు ఈ పథకం కింద మంజూరు చేసినట్లు తోమర్ తెలిపారు.ఇందులో 4,003 ప్రాజెక్టులకు రూ.2,071 కోట్లు పంపిణీ చేశామన్నారు. Centre disburses Rs 2071cr

narendra singh thomar

అయితే ఇప్పటివరకు మంజూరైన 8,488 ప్రాజెక్టుల్లో గరిష్టంగా 1,954 ప్రాజెక్టులు మధ్యప్రదేశ్‌లో ఉండగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ( AndhraPradesh) లో 1,424, కర్ణాటకలో 900, ఉత్తరప్రదేశ్‌లో 684, రాజస్థాన్‌లో 654, మహారాష్ట్రలో 555 ప్రాజెక్టులు ఉన్నాయి. మంజూరైన దాదాపు 5,067 ప్రాజెక్టులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీలు), 2,576 వ్యవసాయ పారిశ్రామికవేత్తల ప్రాజెక్టులు, 685 వ్యక్తిగత రైతుల ప్రాజెక్టులు, 61 రైతు ఉత్పత్తి సంస్థల ప్రాజెక్టులు, 53 ప్రాజెక్టులు స్టార్టప్‌లకు చెందినవని తోమర్ అన్నారు. Agriculture News, ODD Projects, Thomar

 

Leave Your Comments

వ్యవసాయ మార్కెట్లను మరింత పటిష్టం చేయాలి

Previous article

Animal Husbandry: పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌గా డా. రామచందర్.!

Next article

You may also like