వార్తలు

కేంద్ర ప్రభుత్వం డీఏపీ ఎరువులపై సబ్సిడీ పెంపు..

0

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం రైతులకు అనుకూలంగా చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది. రైతులకు ఉపశమనం కలిగించే విధంగా డీఏపీ ఎరువులపై ఇచ్చే సబ్సిడీని 140% పెంచింది. రైతులకు 2,400 రూపాయలకు బదులుగా బ్యాగ్ కు 1,200 రూపాయల చొప్పున డి – అమ్మోనియం ఫాస్ఫెట్ ఎరువులు అందించాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎరువుల ధరలపై సబ్సిడీ రేట్లను నిర్ణయించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ ఫాస్పోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైన ధరలు పెరగడంతో ఎరువుల ధర పెరుగుతోందన్న ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష నిర్వహించారు.
అంతర్జాతీయ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నప్పటికీ రైతులకు పాత రేటుకే ఎరువులు విక్రయించాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రైతులకు అందిస్తున్న సబ్సిడీని 140 శాతం పెంచాలని సూచించారు. దీంతో ఇక నుంచి బస్తా డీఏపీ ఎరువు ధర రూ. 1200 లకే లభించనుంది. పెరిగిన ధరల భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇటీవల డీఏపీ ఎరువులో ఉపయోగించే ఫాస్ఫోరిక్ ఆమ్లం, అమ్మోనియా మొదలైన ధరలు అంతర్జాతీయంగా 60 శాతం నుంచి 70 శాతం వరకు పెరిగిపోయాయి. దీంతో బస్తా డీఏపీ ధర రూ. 2,400 కు చేరుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సబ్సిడీ ప్రకారం రూ. 500 తగ్గించి రైతులకు రూ. 1,900 కు విక్రయిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో రైతులకు బస్తా డీఏపీ రూ. 1,200 లకే అందుబాటులోకి రానుంది. దీంతో కేంద్ర ప్రభుత్వంపై దాదాపు రూ. 14,775 అదనపు భారం పడనుందని ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎరువులపై సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం భరించాల్సిందేనని ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోడీ అధికారులకు సూచించారు. ఇక దేశ వ్యాప్తంగా రసాయన ఎరువులకు సంబంధించి కేంద్రం ప్రతి సంవత్సరం రూ. 80,000 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ నెల ప్రారంభంలోనే పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కింద నగదు బదిలీ కార్యక్రమం చేపట్టారు. ప్రధాని స్వయంగా రైతుల ఖాతాల్లో రూ. 20, 667 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశారు.

Leave Your Comments

చిన్నపిల్లలకు – ఆరోగ్యకరమైన స్నాక్స్

Previous article

కేంద్ర ప్రభుత్వం పప్పు దినుసుల దిగుమతులపై ఆంక్షలు ఎత్తి వేత..

Next article

You may also like