ఆంధ్రప్రదేశ్ఉద్యానశోభమన వ్యవసాయంవ్యవసాయ పంటలు

అరటి సాగులో యాజమాన్య పద్ధతులు

0

ఉష్ణమండలంలో పండించే ముఖ్యమైన పండ్లలో అరటి ఒకటి. భారతదేశము అరటి పంట విస్తీర్ణంలోనూ, దిగుబడిలోనూ ప్రపంచంలో మొదటి స్థానాన్ని ఆక్రమించినది. ఆంధ్రరాష్ట్రంలో అరటి దాదాపు 99,372 హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ, 5.8 మిలియన్ టన్నుల ఉత్పత్తితో భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నది. రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోను అరటి సాగులో (ఉన్నప్పటికీ) తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, అనంతపురం, గుంటూరు, కర్నూలు, విజయనగరం, కృష్ణ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో అధికంగా పండిస్తున్నారు.

అరటికి 25° – 30° సెల్సియస్ ఉష్ణోగ్రత మిక్కిలి అనుకూలము. శీతాకాలంలో ఉష్ణోగ్రత 15° సెల్సియస్ కన్నా తక్కువ ఉండకూడదు. సారవంతమైన, తగినంత నీటివసతి కలిగి,సేంద్రియ పదార్థము గల నేలలు అనుకూలము.

రకములు :

  1. కర్పూర చక్కెరకేళి : దేశావాలిగా సాగుచేయబడే రకాలలో ముఖ్యమైనది. కాలపరిమితి 11 – 12 నెలలు కలిగి, సగటున 16 – 18 కిలోల బరువుగల గెలలతో హెక్టారుకు సరాసరి 30 టన్నుల దిగుబడినిస్తుంది.
  2. తెల్ల చక్కెకేళి : దీని కాలపరిమితి 11 – 12 మాసములు. సగటున 6 – 8 కేజీల బరువున్న గెలలతో 5 – 6 హస్తాలు కలిగి ఉంటాయి.
  3. గ్రాండ్ నైన్ : ఇటీవలి కాలంలో ఎక్కువ సాగులో ఉన్న రకము. పంట కాలము 10 – 11 నెలలు. సగటున గెల బరువు 28 – 30 కిలోలు ఉండి 9 – 10 హస్తాలు కలిగి ఉంటుంది. హెక్టారుకు సగటున 65 – 75 టన్నుల దిగుబడినిస్తుంది.

టిష్యూకల్చర్ అరటి మొక్కలు :-

టిష్యూకల్చర్ అనగా నాణ్యమైన అరటి పిలకల కణజాలం నుండి ప్రయోగశాలలో అభివృద్ధి పరచిన మొక్కలు. ఆరోగ్యవంతమైన, బలమైన పిలకల నుండి సేకరించిన కణజాలం నుండి అభివృద్ధిపరచిన మొక్కలు తెగుళ్ళు లేనివిగాను, ఆరోగ్యవంతంగాను ఉండును. పొలంలో నాటినప్పుడు వేగంగాను, బలంగాను ఎదిగి మామూలు పిలక పంటకన్నా 35 – 45 శాతం వరకు అధిక దిగుబడినిస్తాయి. తోట అంతా ఒకేసారిగా గెలలు వేస్తాయి.

టిష్యూకల్చర్ అరటి మొక్కలకు డ్రిప్ పద్ధతిలో నీరు మరియు ఎరువుల యాజమాన్యం :-

                 డ్రిప్ పద్ధతిలో నీరు మరియు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుట వలన ఆదా అగును. డ్రిప్ ద్వారా నత్రజని, పోటాష్ ఎరువులు ఇచ్చునప్పుడు బలమైన నేలల్లో సిఫార్సు చేసిన ఎరువులలో 60 శాతం, తేలిక నేలల్లో 75 శాతం మోతాదు సరిపోవును.

ఒక ఎకరంలో మొక్కల సాంద్రతను బట్టి పైన తెలిపిన ఎరువులను మొక్కల సంఖ్యతో గుణించి మొత్తము ఎరువును నిర్దేశించి వాడుకొనవలెను.

ఉదా : 4 గ్రా. యూరియా X 1250 మొక్కలు 5 కిలోలు (ఎకరానికి).

గమనిక : అరటిలో సూక్ష్మధాతువుల లోపాలు సవరించడానికి ఎకరానికి 2 కిలోల సూక్ష్మధాతు మిశ్రమం (ఐరన్, రాగి, మాంగనీసు, మాలిబ్డినం, జింకు మరియు బోరాన్) అరటి నాటిన 2వ నెల, 3 వనెల, 4వ నేల మరియు 5 వ నెలలో డ్రిప్ ద్వారా ఇవ్వవలెను.

గెలల యాజమాన్యం :-

అరటిలో సమర్థవంతంగా అన్ని రకాల వనరులను ఉపయోగించి అధిక నికర ఆదాయాన్ని మరియు నాణ్యమయిన గెలలను పొందాలంటే వివిధ యాజమాన్య పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా మొక్కనేల నుండి ఆవిరి అయ్యే నీటిలో 80 % నీటిని బిందుసేద్య పద్దతి ద్వారా అందించాలి. భూసారాన్ని అనుసరించి 75 % సిఫార్సు చేసిన ఎరువులను ఫర్టిగేషన్ పధ్ధతి ద్వారా అందించాలి. అర్కబనానా స్పెషల్ అనే సూక్ష్మధాతు మిశ్రమాన్ని 5.0 గ్రా. లీటరు నీటికి 4, 5, 6వ నెలకు మరియు గెలలు వచ్చిన తరువాత ఒకసారి పిచికారి చేయాలి.

గెలలు వచ్చిన తరువాత 13-0-45 ఏ 5.0 గ్రా మరియు 0-0-50 ఏ 5.0 గ్రా గెలలపై రెండుసార్లు (మగ పువ్వు తీసిన తరువాత ఒకసారి, 30 రోజుల తరువాత రెండవసారి) పిచికారి చేయాలి.

సేంద్రీయ పద్ధతిలో అరటి సాగు : అరటిని ఈ క్రింద తెలుపబడిన విధానంలో సేంద్రియ

ఎరువులను ఉపయోగించి సాగు చేసినట్లయితే అధిక దిగుబడి సాధించడమే కాకుండా నాణ్యమైన పండ్లను పొందడానికి అవకాశం ఉంది.

అరటి మొక్క ఒక్కింటికి సిఫార్సు చేయబడిన 200 గ్రా: 50 గ్రా 200 గ్రా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువును ఈ క్రింద తెలుపబడిన విధంగా వేయాలి.

మొక్క నాటేటప్పుడు :-

  1. బాగా చివికిన పశువుల ఎరువు (10 కేజి)
  2. వేప పిండి (1.25కేజి )
  3. “మైకోరిజా” (Mikoriza) ( 25 గ్రా)
  4. “ట్రైకోడెర్మా హర్జియానమ్” (Trichoderma harzianum ) (50 గ్రా)
  5. అజోస్పిరిల్లమ్ (Azospirillum) (50 గ్రా)
  6. భాస్వరాన్ని కరిగించే బాక్టీరియా (50 గ్రా)

నాణ్యమైన గెలల దిగుబడికి సూచనలు :-

2 శాతం రంధ్రాలు చేసిన తెల్లని పారదర్శక పాలిథీన్ సంచులను గెలలకు తొడగటం వలన, పండ్ల యొక్క పరిమాణం పెరిగి లేత ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయంగా తరువాత నాణ్యమైన పండ్లు పొందుట వలన విదేశాలకు ఎగుమతి చేయుటకు అనుకూలంగా ఉంటాయి.

తోట వయసును బట్టి వేసవిలో కలిగే నష్టం యాజమాన్య పద్ధతులు :-

వేసవిలో నాలుగు మాసాల లోపు తోటల ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. తడులు 3 రోజుల కొకసారి అందించలేని పరిస్థితుల్లో కాండం మరియు దుంప కూడా ఎండి, కుల్లిపోతుంది. ఎండలు తగ్గిన తర్వాత చెట్లు చిగురించి మామూలు ఎదుగుదలకు ప్రతి 3 లేక 4 రోజుల కొకసారి నీటి తడి తప్పనిసరిగా ఇవ్వాలి. ఎరువులను తక్కువ మోతాదులో దగ్గర దగ్గరగా ఎక్కువసార్లు అందివ్వాలి. ఒకటి లేక రెండు మాసాల వయసుగల తోటల్లో ఎక్కువ శాతం చనిపోతే, వాటిని దున్ని మరల జూన్, జూలై నెలల్లో నాటుకోవాలి. వేసవి కాలంలో నీటి ఎద్దడి ఏర్పడే పరిస్థితుల్లో ముందుగానే అరటి మొక్కలపై 0.1 మిల్లీ మోతాదు (180 మి.గ్రా/100 లీటర్ల నీటికి ఈథైల్ సాలిసిలిక్ ఆమ్లమును పిచికారి చేయడం ద్వారా మొక్కలలో నీటి ఎద్దడిని తట్టుకొనే శక్తిని పెంపొందించుకోవచ్చు.

సస్యరక్షణ :  పురుగులు :

  1. నులి పురుగులు (నెమటోడ్స్) :- నులి పురుగులు అరటి మొక్కల వేర్లను ఆశించి ఎక్కువ నష్టాన్నికలిగిస్తాయి. కొన్ని రకాల నులి పురుగలు వేర్లలోకి చొరబడి రసం పీల్చి వేర్లపై చారలు ఎర్పరుస్తాయి. నులి పురుగులు ఆశించడం వలన వేర్లపై కాయల వంటి బడిపెలు ఏర్పడుతాయి. నులి పురుగులు ఆశించడం వలన వేళ్ళు, దుంప బలహీన పడి మొక్క నీటిని, పోషకాలను సరిగ్గా తీసుకోలెదు.

నివారణ :

1) నులి పురుగులు సోకనటువంటి తోటల నుంచి పిలకలు సేకరించాలి.

2) పిలకల దుంప పై చర్మ పలుచగ చెక్కి తరువాత కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు మోనోక్రోటోఫాస్ కలిపిన ద్రావణంలో ముంచి నీడలో ఆరనిచ్చి తరువాత నాటుకోవాలి.

3) వేసవిలో లోతుగా దుక్కిచేసి బాగా ఎండగా ఇచ్చిన నేలల్లో ఆరటిని పాతుకోవాలి.

4) పంట మార్చిడి చేయాలి. నేలలో వేర్లపై చారలు కలుగజేయ నులిపురుగులను తగ్గించుటకు జనుము పంట తరువాత ఆరటి నాటుకోవాలి.

5) నులి పురుగులు సోకిన ఆరటి తోటల్లో మొక్కకు 25 నుండి 45 గ్రాలు కార్బోప్యూరాన్ గులికలు మొక్క మొదలు వద్ద 10 సెం.మీ. లోతులో వేసి మట్టితో కప్పి తేలికగా నీరు పెట్టాలి.

దుంపపుచ్చు : – దుంపపుచ్చు పురుగు దుంపను తొలిచి, నష్టపరుస్తుంది. అరటి చెట్టు నీరు లేక వడలినట్టు కనిపిస్తుంది. ఆకులన్ని నీటి యద్దడిని సూచిస్తాయి. లక్షణాలు కనిపించిన వెంటనే నివారణ చేపట్టకపోతే క్రమేపి చెట్టు ఎండిపోతుంది.

తెగుళ్ళు :-

సిగటోక ఆకుమచ్చ తెగులు : ఈ తెగులు బూజు జాతి శిలీంధ్రముల వలన కలుగజేయబడుతుంది.

ఈ తెగులు అన్ని కాలాల్లోను పంటను ఆశిస్తుంది. కాని వర్షాకాలంలో అంటే జూలై నుండి నవంబరు నెలల్లో తెగుల ఉదృతి ఎక్కువగా ఉంటుంది. ఆకులపై మొట్టమొదట చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపి అవి పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి. ఈ మచ్చలు గోధుమ రంగులోకి మారి పరిమాణంలో పెద్దవయి ఒక దానితో ఒకటి కలిసిపోతాయి. తెగుల ఉదృతి పెరిగినప్పుడు ఆకులు ముందుగానే ఎండిపోతాయి. గెల ఈనిన తరువాత తెగుల తీవ్రత ఎక్కవయినచో నష్టము అధికంగా ఉంటుంది.

సిగటోక ఆకు తెగుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు :-

  1. అరటి తోటలో ఎక్కువగా నీరు ఉంచుకోకుండా ఉండడం.
  2. అరటి తోటలో ఎప్పటికప్పుడు కలుపు తీసివేయడం.
  3. అరటిలో సిపార్సు చేసిన ఎరువులనే వాడటం.
  4. పిలకలు ఎప్పటికప్పుడు తీసివేయాలి.
  5. కర్బెండజిం ఏ 2.0 గ్రా ఒక లీటరుకు + ప్రోపికొనజోల్ ఏ 1.0 మి. లీ లీటరు నీటికి + కేలిఒల్ (మినరల్ నూనె) ఏ 10.0 మి.లీ లీటరు నీటికి కలిపి ఒకే సారి పిచికారి చేయడం.
  6. డైఫెన్కొనజోల్ ఏ 0.1% +కేలిఒల్ (మినరల్ నూనె)ఏ 10.0 మి.లీ లీటరు నీటికి కలిపి ఒకే సారి పిచికారి చేయడం.
  7. టైప్లాక్సిస్ట్రోబిన్ (25 %) + టేబుకొనజోల్ (0.14 %) + కేలిఒల్ (మినరల్ నూనె) ఏ10.0 మి.లీ లీటరు నీటికి కలిపి ఒకే సారి పిచికారి చేయడం.

పనామ తెగులు :- ఈ తెగులు విత్తన పిలకల ద్వారా మరియు మట్టి ద్వారా వ్యాపించును. అమృత పాణి రకము ఈ తెగులును ఏ మాత్రం తట్టుకోలేదు. బొంత, తెల్ల చక్కెర కేలి రకములు కొన్ని ప్రతికూల పరిస్థిలలో ఈ తెగులుకు గురవుతాయి.

ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులు క్రింది నుండి పసుపు వర్ణంలోకి మారి, ఎండిపోయి, ఆకు తొడిమ వద్ద విరిగి కాండము వెంట వ్రేళాడుతుంటాయి. భూమికి దగ్గరగ కాండము పై నిలువుగా పగులు ఏర్పడుతుంది.

ఈ తెగులును రసాయన ద్వారా నివారణ సాధ్యపడదు. కనుక ఈ తెగులును తట్టుకోనే ఆరటి రకాలను సాగు చేయడం ఒక్కటే మార్గం.

బ్యాక్టీరియా దుంప కుళ్ళు : –పెద్దపచ్చ అరటి, పొట్టిపచ్చ అరటి మరియు తెల్లచక్కెర కేళి రకములను ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ రకముల మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే తెగులు ఉదృతి ఎక్కువ అవుతుంది. పెద్ద మొక్కలలో కూడా ఈ తెలుగు అధిక నష్టం కలుగజేస్తుంది.

నివారణ :-

1) ఈ తెగులు తట్టుకోలేని పచ్చ అరటి మరియు తెల్లచక్కెర కేళి రకములను ఫిబ్రవరి – జూన్ నెలల మధ్య నాటరాదు.

2) వేసవిలో తోటలకు సరిపడ నీరు పెట్టాలి.

3) క్రొత్తగా తోటలు వేయడానికి తెగులు సోకనటువంటి ఆరోగ్యవంతమైన ప్రాంతముల నుండి మాత్రమే పిలకలు సేకరించాలి.

4) ఈ తెగులు సమస్యాత్మకంగా మారిన నేలల్లో వరి, చెరుకు లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి.

5) తోటల్లో తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహ తీసివేసి తోట బయట చిన్నమొక్కలుగా నరికి ఎండుతుక్కు వేసి తగులబెట్టాలి. మొక్కలు తీసివేసిన చోట, చుట్టు ప్రక్కల ఆర్యోగవంతమైన మొక్కల మొదళ్ళ వద్ద మట్టి బాగా తడిసేలా బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్ళతో (25 గ్రా॥1 లీ. నీటికి) తడపాలి లేదా సూడోమోనాస్ 50 గ్రా॥ 1లీ. నీటికి కలిపి ప్రతి మొక్కకు పోయాలి.

వైరస్ తెగుళ్ళు :-

వెర్రితలలు (బంచీటాప్): ఈ తెగుళ్ళు సోకిన మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఆకులపై

పచ్చరంగు తగ్గి ఈనెల మధ్య పత్రహరిత హీనంగా కనపడుతుంది. ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. ఆకుల పరిమాణం తగ్గి కత్తుల మాదిరిగా ఉంటాయి. ఇటువంటి ఆకులు మొవ్వులో గుబురుగా ఎర్పడుతాయి. మొక్క ఏ దశలో అయిన ఈ తెగుళ్ళు ఆశించవచ్చు. మొక్క ప్రారంభ దశలోనే ఈ తెగుళ్ళు ఆశించిన యెడల ఆ మొక్కలు గెలలు వేయవు. తెగులు సోకిన మొక్కలు గెల వేసిన కూడ ఆవి సరిగా తయారుకావు. తోటలో తెగులు సోకిన మొక్కల నుండి ఆరోగ్యవంతమైన మొక్కలకు ఈ వైరస్ తెగుళ్ళు అరటిని ఆశించే పేను బంక పురుగుల ద్వారా వ్యాపిస్తు౦ది.

నివారణ :-

1) ఈ తెగులు తట్టుకోలేని పచ్చ అరటి మరియు తెల్లచక్కెర కేళి రకములను ఫిబ్రవరి – జూన్ నెలల మధ్య నాటరాదు.

2) వేసవిలో తోటలకు సరిపడ నీరు పెట్టాలి.

3) క్రొత్తగా తోటలు వేయడానికి తెగులు సోకనటువంటి ఆరోగ్యవంతమైన ప్రాంతముల నుండి మాత్రమే పిలకలు సేకరించాలి.

4) ఈ తెగులు సమస్యాత్మకంగా మారిన నేలల్లో వరి, చెరుకు లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి.

5) తోటల్లో తెగులు సోకిన మొక్కలను దుంపలతో సహ తీసివేసి తోట బయట చిన్నమొక్కలుగా సరికి ఎండుతుక్కు వేసి తగులబెట్టాలి. మొక్కలు తీసివేసిన చోట, చుట్టు ప్రక్కల ఆర్యోగవంతమైన మొక్కల మొదళ్ళ వద్ద మట్టి బాగా తడిసేలా బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్ళతో (25 గ్రా॥1 లీ. నీటికి) తడపాలి లేదా సూడోమోనాస్ 50 గ్రా॥ 1లీ. నీటికి కలిపి ప్రతి మొక్కకు పోయాలి.

వైరస్ తెగుళ్ళు :-

వెర్రితలలు (బంచీటాప్) : ఈ తెగుళ్ళు సోకిన మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఆకులపై

పచ్చరంగు తగ్గి ఈనెల మధ్య పత్రహరిత హీనంగా కనపడుతుంది. ఆకుల ఈనెలు మాత్రం ఆకుపచ్చగా ఉంటాయి. ఆకుల పరిమాణం తగ్గి కత్తుల మాదిరిగా ఉంటాయి. ఇటువంటి ఆకులు మొవ్వులో గుబురుగా ఎర్పడుతాయి. మొక్క ఏ దశలో అయిన ఈ తెగుళ్ళు ఆశించవచ్చు. మొక్క ప్రారంభ దశలోనే ఈ తెగుళ్ళు ఆశించిన యెడల ఆ మొక్కలు గెలలు వేయవు. తెగులు సోకిన మొక్కలు గెల వేసిన కూడ ఆవి సరిగా తయారుకావు. తోటలో తెగులు సోకిన మొక్కల నుండి ఆరోగ్యవంతమై న మొక్కలకు ఈ వైరస్ తెగుళ్ళు అరటిని ఆశించే పేను బంక పురుగుల ద్వారా వ్యాపిస్తు౦ది.

సాంకేతిక సహకారం :-

డా.ఎమ్.బాలక్రిష్ణ సీనియర్ శాస్త్రవేత్త (మృత్తిక శాస్త్ర విభాగం) మరియు అధిపతిడా. ఎస్. ఫిరోజ్ హుస్సేన్ శాస్త్రవేత్త, ఉద్యాన విభాగం, డా. ఎన్. శ్రీవిద్యా రాణి శాస్త్రవేత్త, విస్తరణ విభాగం, డా. బి. ఎస్. కాంతి శ్రీ శాస్త్రవేత్త, గృహ విజ్ఞాన విభాగం, డా. బి. గోవింద రాజులు, విస్తరణ సంచాలకులు, డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, డా. షేక్. యన్. మీరా , ICAR-ATARI, ZONE-X.

Leave Your Comments

గినీ కోళ్ల పెంపకంలో మెళకువలు

Previous article

జీవన ఎరువులు వేద్దాం – భూసారాన్ని పెంచుకుందాం

Next article

You may also like