రబీ కాలంలో సుమారు 22,38,000 హెక్టార్ల పంట విస్తీర్ణం నకు గాను 16,76,500 హెక్టార్లు అంటే 75% మాత్రమే నమోదు అవుతుంది(2023) అందులో వరి 5,64,000 హెక్టార్లు, అపరాలు 6,69,000,మొక్క జొన్న 1,52,000 హె. ,1,04,000 హె నూనె గింజలు పంటలు మరియు ఇతర పంటలు 1,87,500 హె. నమోదు అయ్యాయి. రాను రాను పంటల విస్తీర్ణం తగ్గటానికి అమాంతం పెరిగిన సాగు ఖర్చే ప్రధానమైన కారణం అని చెప్పవచ్చు. కూలీల కొరత, పెరిగిన కూలి వేతనం, కూలీల పనితనం తగ్గటం, వ్యవసాయ ఉత్పాదకాల ధరలు ముఖ్యంగా భాస్వరం మరియు పొటాష్ ఎరువుల ధరలు ధశాబ్ధా కాలం లో మూడు రేట్లు పెరగటం మూలిగే నక్క పై తాటి పండు పడ్డ చందంగాక్రిమి సంహారక మందుల ధరలు కూడా విరివిగా పెరిగిపోవటంతోపాటు గిట్టుబాటు ధరలు అంత అంత మాత్రమే ఉండటం వలన వ్యవసాయం పై ఆసక్తి చూపక ఇతర రంగాల వైపు రైతులు ముఖ్యంగా యువకులు మల్లుతున్నారు. వివిధ పంటలలో సాగు ఖర్చును పరిశీలిస్తే ఒక ఎకరా వరి పంట పండించటానికి సుమారు 23 -25 వేల రూపాయిలు సాగు ఖర్చు అవుతుంది. వేరుశనగ లో సుమారు రూ.18,000 ల నుండి రూ.20,000 వరకు అవుతుంది. వరి మాగాణి అపరాలలో సుమారు రూ.10,000 మరియు మొక్కజొన్న సాగు కు రూ.15,0000 నుండి రూ.18,000 ల వరకు అవుతుంది. ఈ తరుణం లో సాగు ఖర్చు తగ్గించే మార్గాల పై రైతులు దృష్టి సారిస్తే కాని వ్యవసాయ మనుగడ సాధ్యం కాదు .
సాగు ఖర్చు తగ్గించే మెళకువలు :
- వేసవి లో లోతు దుక్కులు చేయటం వలన సూపతావస్థ దశ లో ఉన్న పురుగులను నాషినం చేయటం ద్వారా సాగు ఖర్చు ను తగ్గించుకోవచ్చు.
- పొలాన్ని తయారు చేయటం కోసం రోటావెటర్ వాడడం ద్వారా నేల మెత్తగా తయారవ్వటానికి వీలవుతుంది కాబట్టి ట్రాక్టర్ కాల్టీవెటర్ తో ఎక్కువ దుక్కులు అవసరం ఉండదు.
- పచ్చి రొట్ట ఎరువు కోసం జీలుగ, కట్టే జనుము మరియు పిల్లిపెసర వంటి పంటలను పండించటం ద్వారా భూమి కి 3-6 టన్నుల సేంద్రీయ పదార్ధం తోడై ఎరువుల పై ఖర్చు ను 30 % వరకు తగ్గించకోవచ్చు నూతన మరియు చీడ పీడ లను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవటం.
అపరాలలో పల్లాకు తెగులను తట్టుకునే రకాలను అనగా అనగా పెసర లో ఎల్. జి. జి 460 ఎల్.జి.జి 607 ఎల్.జి.జి 630, ఐపీఎం2-14 మినుము లో ఎల్ బి జి 787, 884, 904 టీబీజీ 104 మరియు 129 మరియు వొంబన్ 8 వరి లో అగ్గి తెగులను,చౌడను చేను తట్టుకునే రకాలను మరియు చేనుపై పడిపోని రకాలను ఎంచుకోవడం ద్వారా సాగు ఖర్చు ను తగ్గించుకోవచ్చు.
విత్తన శుద్ధి చెబుతుంది తెగుళ్ళకి బుద్ది :
విత్తన శుద్ధి చేయడం ద్వారా కీటకాల నుండి మరియు తెగుళ్ల నుంచి పంటను కాపాడుకోవడం ద్వారా సాగు ఖర్చు ను తగ్గించుకోవచ్చు. అపరాలలో తయోమితాక్సామ్ లేదా ఇమీడాక్లోప్రిడ్ తో మరియు ట్రైకోడెర్మా వీరిడే లేదా మాన్కోజబ్ తో రబీ కాలం వరి సాగులో సాధారణంగా నారు పోసి నాట్లు వేసే పద్ధతి కంటే నేరుగా మొలకెత్తిన విత్తనాన్ని ఎద జల్లుకోవటం గాని లేదా డ్రమ్ సీడర్ తో గాని విత్తినట్లయితే విత్తనం ఖర్చు సగం ,నారుపెంచే ఖర్చు, నారు తీసి పొలం లో సర్దే ఖర్చు, మరియు నాట్లు వేసే ఖర్చు వెరసి ఆయా ప్రాంతాన్ని బట్టి సుమారు 6500 నుంచి 8000 వరకు ఆదా అవుతుంది.
ఎరువుల యాజమాన్య విషయంలో జీవన ఎరువులు అయిన భాస్వరం కు సంభందించి ఫాస్ఫో బాక్టీరియా, నత్రజని కోసం అజటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం మరియు పొటాషియం కోసం పొటాషియం రిలిజింగ్ బాక్టీరియా వాడినట్లైతే రసాయన ఎరువుల పై సుమారు 25శాతం వరకు అదా చేయవచ్చు. పొలం గట్లను శుభ్రంగా ఉంచుకొని బంతి వేయటం వల్ల పురుగుల ఉదృతి తెలుస్తుంది తద్వారా సరైన సమయానికి నివారణ చర్యలు చేపట్టడం వలన ఖర్చు తగ్గుతుంది లేదా గట్ల పై కంది వేయటం వలన అదనపు ఆదాయం వస్తుంది. కలుపు నివారణ కు సరైన సమయానికి పదును బాగా వున్నప్పుడు కలుపు నాశినులను వాడుకుంటే కూలీల ఖర్చు తగ్గించుకోవచ్చు.
పొలంలో పక్షి స్థావరాలను ఏర్పాటు చేస్తే సస్యరక్షణ ఖర్చు లు తగ్గించుకోవచ్చు. ట్రైకో కార్డ్స్ విడుదల చేసినట్లయితే కాండం తొలిచే పురుగు ను నివారించటం వలన పురుగు మందులకు అయ్యే ఖర్చను ను తగ్గించుకోవచ్చు.
రసం పీల్చే పురుగులైన పచ్చ దోమ తెల్ల దోమ ఉనికి తెలుసుకోవడం కోసం మరియు నివారించడం కోసం గ్రీజు పూసిన పసుపు అట్లను పొలంలో ఎనిమిది నుంచి పది చోట్ల అమర్చుకోవాలి. అదేవిధంగా తామర పురుగుల ఉనికి కోసం మరియు నివారణ కోసం గ్రీజు పూసిన నీలం రంగు ఆటలను ఏర్పాటు చేసుకోవాలి తద్వారా ఎక్కువసార్లు క్రిమిసంహారక మందులను పిచికారి చేయవలసిన అవసరం లేకుండా సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు.
సరైన సమయంలో బాగా పదును ఉన్నప్పుడు కలుపు నాశనం వాడడం ద్వారా కలుపు తీయించడానికి అవసరమయ్యే ఖర్చును నివారించుకోవచ్చు.
అన్ని పంటలలో పంట కోత మరియు నూర్పు యంత్రాలు వాడడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణాన్ని ఎక్కువ పంటను నూర్చడం ద్వారా కూలీల ఖర్చు తగ్గించవచ్చు.
రైతులు పంట కోత అనంతరం పంట అవశేషాలను భూమి లో కలియ దున్నటం వలన భూసారం పెంచుకోవచ్చు తద్వారా ఎరువుల పై ఖర్చు తగ్గుతుంది. పంట అవశేషాలు ఎక్కువగా ఉన్నప్పుడు వర్మీ కంపోస్టు లేదా నాడెప్ కంపోస్టు ను తయారు చేయడం వలన సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు.
విషపు ఎరలను తయారు చేయడం వలన పురుగు మందుల కోసం చేసే ఖర్చు ను తగ్గించుకోవచ్చు. 5కేజీ ల మెత్తని తవుడు రెండు కేజీల బెల్లం కలిపి పులియ బట్టి అయా పురుగుల కొసం సిఫారసు చేసిన పురుగు మందు ను కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం వేళల్లో పొలం లో వేయాలి.
వేసవిలో లోతు దుక్కులు చేయటం వలన సప్తావస్త దశలో ఉన్న పురుగులను నాశనం చేయటం ద్వారా సాగు ఖర్చు ను తగ్గించుకోవచ్చు.
పచ్చి రొట్ట ఎరువు కోసం కట్టే జనుము, పిల్లిపెసర వంటి పంటలను పండించటం ద్వారా ఎరువుల పై ఖర్చు ను 30 % వరకు ఆధా చేయవచ్చు.
వరి పైరులో ప్రతి రెండు మీటర్ల దూరానికి ఒక అడుగు చొప్పున కాలిబాటలు తీయటం వలన సుడిదోమ నుండి కాపాడి సాగు ఖర్చు ను తగ్గించుకోవచ్చు.
అంతర పంటలను ఏరా పంటలను రక్షక పంటలను వేయటం ద్వారా ప్రధాన పంట కు చీడపీడల బెడద తగ్గి సావు ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా వేరుశనగ కంది లేదా వేరుశనగ జొన్న 5:1 నిష్పత్తిలో వేసుకున్నట్లయితే మంచిది. రాగి కంది 8:2 నిష్పత్తిలో వేస్తే నివారణతో పాటు తేమ సంరక్షణ కూడా జరుగుతుంది.
సమగ్ర పంటల విధానం ను కూడా పాటించడం ద్వారా పంటల అవశేషాలు వృధా కాకుండా పునః ఉపయోగం ద్వారా వనరుల వినియోగ సమర్థవంతంగా జరిగటం, నీటిని సంరక్షించడంతోపాటు భూసార అభివృద్ధి జరిగి మిగతా వనరులను తక్కువ వినియోగించడం ద్వారా సాగు ఖర్చు తగ్గుతుంది.
రబీ వరి సాగు లో ఆశించే చీడపీడలలో కాండం తోలుచు పురుగు మరియు అగ్గి తెగులు ప్రధానమైనది. నాట్లు వేసే పద్దతిలో సాగు చెస్తే నాటే ముందు నారు చివర్లు ఒక అంగుళం వరకు తుంచి నాటినట్లయితే చాలావరకు కాండం తొలుచు పురుగును నివారించుకోవచ్చు.
సుడోమోనాస్ కేజీ విత్తనానికి 10 గ్రాములు లేదా కర్బండిజం మూడు గ్రాములు చొప్పున కలిపి విత్తనం చేసినట్లయితే చాలావరకు అగ్గి తెగులు నుంచి పంటను కాపాడుకోవచ్చు.
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు తయోమితాక్సాము మరియు సయాంత్ర నిలిప్రోలిన్ కలయిక మందు తో కేజి విత్తనానికి 4 గ్రా.చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయడం ద్వారా సాగు ఖర్చు తగ్గుతుంది.
డా.పి.వెంకట రావు, సీనీయర్ శాస్త్రవేత్త & హెడ్, పి. సౌజన్య, మృత్తిక శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధనా స్థానం, సీతంపేట, ఫోన్ : 97052 09418


























