వ్యవసాయ పంటలు

Management of Peanut: శనగ సాగులో మేలైన యాజమాన్యం.!

0
Peanut(Groundnut)
Storage of Groundnut

Management of Peanut: శీతాకాలంలో మంచు ఆధారంగా మిగులు తేమను ఉపయోగించుకుంటూ నల్లరేగడి నేలల్లో రబీలో పండిరచే పప్పుధాన్యాల పంట శనగ  తెలంగాణలో సుమారుగా 1.5 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగు చేయబడుతుంది అందులో ముఖ్యంగా జోగులాంబ గద్వాల్‌, కామారెడ్డి, సంగారెడ్డి మరియు ఆదిలాబాద్‌ జిల్లాలో ఎక్కువగా సాగవుతుంది. ముఖ్యంగా ఖరీఫ్‌లో వేసిన స్వల్పకాలిక పంటలు పూర్తి అవగానే లేదా ఏ పంట వేయని పొలంలో ఈ పంటను విత్తుకోవచ్చు. నీరు నిలవకుండా చౌడు లేని, తేమ బాగా పట్టి ఉంచే సారవంతమైన, మధ్యస,్థ నల్లరేగడి నేలలు మరియు ఉదజని సూచిక ఆరు నుండి ఏడు  ఉండే నేలలు ఈ  ఈ పంట సాగుకు అనుకూలం.
విత్తుకునే ముందు  భూమిని నాగలితో లేదా కల్టివేటర్‌తో ఒకసారి తరువాత గొర్రెలతో రెండుసార్లు మెత్తగా దున్ని చదును చేసి సిద్ధం చేయాలి. పశువుల ఎరువు 10 టన్నులు, గంధకం 16 కిలోలు,  నత్రజని 8 కిలోలు మరియు భాస్వరం ఎరువులు 20 కిలోలు ఎకరాకు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. విత్తే ముందు భూమిలో సరిపడా తేమ ఉండేటట్లు చూసుకోవాలి.
అనువైన రకాలు –
కాబూలి రకాలు : కె.ఎ.కె.2 : పంటకాలం 95 నుండి 100 రోజులు కలిగి ఉండి, ఎకరానికి ఎనిమిది నుండి పది క్వింటాళ్ళ దిగుబడిని పొందవచ్చు.
ఐ.సి.సి.వి`2  శ్వేత :ఎండు తెగులును తట్టుకునే స్వల్పకాలిక రకం.
విత్తన మోతాదు : విత్తన బరువును బట్టి విత్తన మోతాదు ఎకరాకు మారుతుంది. దేశవాళీ రకాలలో ఎకరానికి 25 నుండి 30 కిలోలు మరియు  కాబూలీ రకాల్లో45 నుండి 60 కిలోలు  అవసరమవుతుంది.
విత్తన శుద్ధి : విత్తుకునే ముందు విత్తనశుద్ధి అనేది చాలా ప్రాముఖ్యం. థైరామ్‌ లేదా కాప్టాన్‌ 3 గ్రాములు లేదా కార్బండిజమ్‌ 2.5 గ్రాములు లేదా విటావాక్స్‌పవర్‌  1.5 గ్రాములు కిలో విత్తనంలో కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. శనగను మొదటిసారిగా పొలంలో సాగు చేసేటప్పుడు మొదట శిలీంధ్ర నాశిని మందులతో శుద్ధిచేసి ఆరబెట్టిన తరువాత రైజోబియం కల్చర్‌ను విత్తనాలకు పట్టించాలి. దీనికై ఎనిమిది కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం మిశ్రమాన్ని 300 మిల్లీలీటర్ల నీటిలో పది శాతం బెల్లం మిశ్రమాన్ని పట్టించి బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.  ఎండు తెగులు సమస్యాత్మకంగా ఉన్న భూముల్లో ట్రైకోడెర్మావిరిడి 8 గ్రాములు కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి.

Peanuts

Peanuts

విత్తేదూరం : సాళ్ళ మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. లావు గింజలు అయినా కాబూలీ రకాలు విత్తినప్పుడు సాళ్లమధ్య 45 సెంటీ మీటర్ల దూరంలో విత్తుకోవాలి. మొక్కల సాంద్రత ఎకరాకు 1, 3 3, 3 3 3  ఉండేటట్లు జాగ్రత్త వహించినట్లు అయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. విత్తనాన్ని నాగలి లేదా గోరుతో సాళ్ల పద్ధతిలో పెట్టుకోవాలి. భూమిలో సరైన తేమ శాతం ఉండేలా చూసుకుని 5`8 సెంటీమీటర్ల లోతు పడేలా విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్‌ కల్టివేటర్‌ లేదా డ్రిల్‌ కమ్‌ ఫెర్టిలైజర్‌ బోదె కాలువల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు.
శనగలో అంతర పంటలుగా మొక్కజొన్న`శనగ, జొన్న`శనగ, పెసర /మినుము`శనగ, సోయాచిక్కుడు`శనగ, నువ్వులు`శనగ మరియు శనగ ప్లస్‌ ధనియాలు (16:4) వేసుకోవచ్చు.

Also Read: kharif Crops Management Practices: అధిక వర్షాల పరిస్థితుల్లో వివిధ ఖరీఫ్ పంటలలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు.!

ఎరువుల యాజమాన్యం : మొదటిగా రెండు టన్నుల పశువుల ఎరువు ఎకరాకు చివరి దుక్కిలో వేసి పంట మొదళ్లలో రోటవేటర్‌తో కలియదున్నాలి. అదేవిధంగా రెండు కిలోల ఫాస్పోబ్యాక్టర్‌ను 200 కిలోల సేంద్రియ ఎరువులతో కలిపి దుక్కిలో గానీ, విత్తేటప్పుడు గానీ సాళ్ళలో పడేటట్లు వేసుకోవాలి. ఈ భూమిలో లభ్యంకాని రూపంలో ఉన్న రూపంలోకి మార్చి మొక్కలకు అందిస్తాయి.
రసాయన ఎరువులను వాడే ముందు భూసార పరీక్షలు అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. రసాయన ఎరువులైన నత్రజని 8 కిలోలు, భాస్వరం 20 కిలోలు, పొటాష్‌ 8 కిలోలు మరియు గంధకం నిచ్చే ఎరువులు 40 కిలోలు ఎకరాకు వేసుకోవాలి. ఎరువుల రూపంలో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ లేదా 50 కిలోల డి.ఎ.పి మరియు 14 కిలోల పొటాషియంను ఎకరాకు వాడాలి. 8 నుండి 12 కిలోల నీటిలో కరిగే గంధకం విత్తేసమయంలో వేసుకోవాలి. భాస్వరం ఎరువును సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూపంలో వేసినట్లయితే పంటలకు కావలసిన గంధకం అందుతుంది.
పంట యొక్క కీలక దశలైనా మొగ్గ దశ మరియు గింజ కట్టే దశల్లో, బెట్ట పరిస్థితుల్లో రెండు శాతం యూరియా లేదా పి.ఎ.పి  ద్రావణం  పిచికారీ చేస్తే కొంత మేరకు దిగుబడులను పొందవచ్చు.
సూక్ష్మ పోషక లోపాలు, యాజమాన్యం : సాధారణంగా శనగలో జింకు, ఇనుము మరియు గంధకం లోపాన్ని గమనించవచ్చు. ఈ పోషక ధాతు లోపాలు వాటి లక్షణాలను ఎలా గుర్తించాలో ఈ లోపాలు ఏర్పడడానికి అనుకూల పరిస్థితులు మరియు లోప సవరణ చర్యలు ఈ క్రింద వివరించబడ్డాయి.
జింక్‌ : ఈ పోషక ధాతువులు లోపిస్తే పంట ఎదుగుదల లోపించి చిట్టి ఆకులు ఏర్పడతాయి తలుపుల మధ్య దూరం తగ్గి కాలిపోయిన మచ్చలు కనిపిస్తాయి. ఇది వరి తరువాత శనగ సాగు చేసే నెలల్లో కనిపిస్తుంది. ఈ పోషక లోపాన్ని సవరించడానికి 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ ఒక ఎకరాకు ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఒకవేళ పైరుపై దీని లోప లక్షణాలు కనిపించినట్లయితే 2 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

Benefits of Peanut

Benefits of Peanut

ఇనుము : ఇనుము లోపం ఉన్నట్లయితే లేత ఆకులు పసుపు రంగులోకి మారి ఎండి రాలిపోతాయి. సున్నపు నిల్వలు ఎక్కువగా ఉండి ఉదజని సూచిక ఎక్కువ (8.5 కంటే ఎక్కువ) ఉన్న నేలలో ఈ లోపం కనిపిస్తుంది. ఈ ధాతు లోపాన్ని సవరించడానికి 5 గ్రాముల ఫెర్రస్‌ సల్ఫేట్‌ (అన్నభేది) ఒక గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పైరుపై వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
గంధకం : గంధకం లోపం గనుక గమనించినట్లయితే పంటలో మొదటిగా లేత చిగురు హరిత వర్ణం కోల్పోయి ఆ తరువాత పసుపు రంగుకు మారుతుంది.  ఈ లక్షణాలు ఎప్పుడైతే నేలలో 8 పి.పి.ఎం కంటే తక్కువ గంధకం ఉన్నప్పుడు గమనించవచ్చు.  ఈ లోపాన్ని సవరించడానికి  81/2 కిలోల నీటిలో కరిగే గంధకాన్ని ఎకరాకు విత్తుకునే సమయంలో వేసుకోవాలి.
కలుపు యాజమాన్యం : విత్తిన 30 రోజుల వరకూ కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్‌ 45 శాతం ఎకరాకు ఒకటి నుండి ఒకటిన్నర లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. అదేవిధంగా విత్తిన వెంటనే లేదా మరుసటిరోజు మొలకెత్తక ముందే పెండిమిథాలిన్‌ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు/ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 30 నుండి 35 రోజుల దశలో గొర్రుతో అంతరకృషి చేసి కూడా కలుపు నివారించుకోవచ్చు
నీటి యాజమాన్యం : నేలలోని తేమను బట్టి ఒకటి లేదా రెండు తేలికపాటి తడులు ఇవ్వాలి. నీటి తడులు పెట్టేటప్పుడు పొలంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. పూత దశలు ముందు అనగా విత్తిన 30`35 రోజులకు ఒకసారి మరియు 55`65 రోజులకు ఒకసారి నీటి తడులను అందిస్తే మంచి దిగుబడులను పొందవచ్చు.
 సస్యరక్షణ –
 పంటను ఆశించే పురుగులు :-
 శనగపచ్చ పురుగు : ఈ పురుగు ఆశించినట్లయితే పంట తీవ్రమైన నష్టానికి గురై దిగుబడి తగ్గే అవకాశం ఉంది. దీని యొక్క తల్లి పురుగు లేత చిగుళ్లపై లేదా పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగు గుడ్లను పెడుతుంది. గుడ్ల నుండి వెలువడిన పిల్ల పురుగు మొగ్గల్ని గోకి తింటుంది. ఎదిగిన లార్వాలు మొగ్గలు తొలచి కాయలోనికి తలను చొపించి మిగిలిన శరీరాన్ని బయటకు ఉంచి లోపల గింజలను తిని డొల్ల చేస్తాయి.  ఈ పురుగు తిన్న కాయలకు గుండ్రటి రంధ్రాలు కనిపిస్తాయి. మొగ్గ, పూత మరియు పిందె దశలో చిరుజల్లు లేదా వర్షం పడిన రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్లయితే ఈ పురుగు యొక్క ఉదృతి ఎక్కువ అవుతుంది.
నివారణ : మొదటిగా వేసవిలో లోతైన దిక్కులు చేసుకోవాలి. అంతరపంటగా ధనియాలు 16 :4  నిష్పత్తిలో సాగు చేయాలి.  చుట్టు పక్కన నాలుగు వరుసల జొన్న పంట యాభై నుండి వంద  బంతి మొక్కలు నాటుకోవాలి. జీవ రసాయనాలు అయిన వేపగింజల కషాయం లేదా వేపనూనె (300 పిపియం) 5 మి.లీ. మొగ్గ దశలో పిచికారీ చేయాలి.  బ్యాసిల్లస్‌ తురింజెనిసిన్‌ (బి.టి) 300  గ్రాములు ఒక ఎకరానికి మరియు  హెలికోవెర్సా ఎన్‌పివి 200 మిల్లీ లీటర్లు ద్రావణాన్ని ఎకరాకు పిచికారీ చేసుకోవాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి.
ఎసిఫేట్‌ 75శాతం ఎస్‌.పి 1.5 గ్రాములు లేదా క్వినాల్‌ ఫాస్‌ 25 శాతం ఇసి 2.0 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇండాక్సాకార్బ్‌ 14.5% ఎస్‌.సి 1.0 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 18.5 ఎస్‌.సి 0.3 మి.లీ. లేదా ఫ్లూబెండామైడ్‌ 31.35 శాతం యస్‌.సి 0.2 మి.లీ. లీటరు నీటిలో వేసి కలుపుకోవాలి. లేదా లామ్డాసైహలోత్రిన్‌ 5 శాతం ఇ.సి 1 మి.లీ. లీటరు నీటిలో లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 5 శాతం యస్‌.జి 0.5 గ్రా. ఒక లీటరు నీటిలో లేదా థయోడికార్బ్‌ 75 శాతం డబ్ల్యు.పి 1.5 గ్రా. లీటరు నీటిలో లేదా క్లోరాంత్రానిలిప్రోల్‌ 9.3 శాతం G లామ్డాసైహలోత్రిన్‌ 4.6 శాతం జడ్‌.సి 0.4 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

Management of Peanut

Management of Peanut

రబ్బరు పురుగు : ఇది మొక్క దగ్గర పత్రహరితాన్ని గోకి తిని నష్టం కలుగజేస్తుంది. పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తాయి. దీని ఉధృతి ఎక్కువైనప్పుడు ఆకులు పాలిపోయి రాలిపోతాయి. ఎప్పుడైతే బెట్ట వాతావరణం కలిగి తరువాత అధిక వర్షపాతం నమోదు అయినప్పుడు మరియు తొలి 20 నుండి 25 రోజులలో రబ్బరు యొక్క ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
నివారణ : దీని నివారణకు క్వినాల్‌ఫాస్‌ 25 శాతం ఇ.సి (రెండు మిల్లీ లీటర్లు / లీటరు నీటికి) లేదా క్లోరిపైరిఫాస్‌ 20 శాతం ఇ.సి (2.5 మి.లీ. లీటరు నీటికి) లేదా నొవాల్యురాన్‌ 10% ఇ.సి లేదా డైప్లూబెంజురాన్‌ 25 శాతం డ.బ్ల్యు.పి (ఒక మిల్లీ లీటరు / లీటరు నీటికి) మందును పురుగు ఉధృతిని బట్టి రెండు నుండి మూడు సార్లు నాలుగు నుండి ఐదు రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.
శనగ పంటను ఆశించే తెగుళ్లు –
ఎండు తెగులు : ఈ తెగులు సోకిన మొక్క యొక్క ఆకులు వడలిపోతాయి. పసుపు రంగులోకి మారి రాలిపోతాయి తెగులు వచ్చిన మొక్కలు అక్కడక్కడా గుంపులు గుంపులుగా చనిపోతాయి. భూమిలో ఉన్న ద్వారా వ్యాపిస్తుంది. ఇది పంట అన్ని దశలలో వ్యాపించును. కాయ దశలో ఎక్కువగా ప్రభావితమవుతుంది
నివారణ : మొదటగా శిలీంద్రనాశినులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. తెగులు తట్టుకునే రకాలైన ఐ.సి.సి.వి 2,  ఐ.సి.ఐ.సి.వి 10, జె.జి 11,  ఐ.సి.సి.వి 37,  నంద్యాల శనగ`47 ఎన్నుకోవాలి.
రైజోక్టోనియా ఎండు తెగులు : ఈ తెగులు సాధారణంగా పూత, కాయ సమయంలో కనబడుతుంది. అక్కడక్కడా ఆకులు పాలిపోయి మొక్క పైభాగం తలలు వాల్చును.  లేదా మొక్క  మొత్తంగా ఎండి పోతుంది.  మొక్క తీసి చూసినట్లయితే వేర్లు నల్లగా మారి కుళ్ళినట్లుగా కనిపిస్తాయి. ప్రధాన వేరు మాత్రమే కనబడుతుంది. పిల్ల వేర్లు ఉండవు. మరియు వేరు బాగా  గీడసబారిపోతుంది.  ఇది భూమి ద్వారా వ్యాప్తి చెందును. సాధారణంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగి 25 నుండి 30 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నమోదైనచో ఈ తెగులు ఉధృతి ఎక్కువగా కనపడుతుంది. భూమిలోని తేమ బాగా తగ్గినప్పుడు బెట్టపరిస్థితుల్లో కూడా తెగులు ఉధృతి పెరుగుతోంది.
నివారణ : ఎండు తెగులును సూచించిన విధంగా పాటించాలి. జె.జి`11 అనే రకం కొంతవరకు ఈ తెగులును తట్టుకుంటుంది. బెట్ట పరిస్థితుల్లో అవకాశం ఉన్నట్లయితే తేలికపాటి తడి ఇవ్వాలి.

Also Read:Rabi Peanuts: రబీ వేరుశనగలో సస్యరక్షణ

Must Watch:

Also Watch:

Leave Your Comments

Management of Dairy Cattle by Farmers: రైతులచే పాడి పశువుల నిర్వహణ.!

Previous article

Management of Pests in crops: పంటల్లో ఆశించే చీడపీడల యాజమాన్యం.!

Next article

You may also like