
గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, APC & ప్రభుత్వ కార్యదర్శి, వ్యవసాయ డైరెక్టర్, మార్కెటింగ్ డైరెక్టర్ మరియు ఇతర ఉన్నతాధికారులు శ్రీమతి రేబెక్కా రిడ్డర్, డివిజన్ హెడ్- ఆసియా, BMEL గారి ఆధ్వర్యంలో జర్మనీ నుండి వచ్చిన ప్రతినిధుల బృందంతో సచివాలయంలో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతల అన్వయం, మార్కెటింగ్, డిజిటల్ వ్యవసాయ అభివృద్ధి వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది.
సిరిసిల్ల జిల్లా వేములవాడలో పైలట్ ప్రాతిపదికన HHI, జర్మనీ సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న పరిశోధన గురించి మంత్రిగారికి బృందసభ్యులు వివరించడం జరిగింది. ఈ పరిశోధనలో భాగంగా 3 FPOల నుండి 55 మంది రైతులను ఎంపిక చేసి, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, సాంకేతికతను ఉపయోగించి కూలీ ఖర్చు తగ్గించడం, డిజిటల్ వ్యవసాయం, పంట దిగుబడులను పెంచడం, డ్రోన్లను ఉపయోగించి నేల యొక్క సారాన్ని పరీక్షించడం, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి వాతావరణ స్టేషన్ ను నిర్వహిస్తూ, రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ సంబంధిత సమాచారాన్ని అందచేయడం జరుగుతుందని గౌరవ మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రిగారు స్పందిస్తూ,
•భారత-జర్మనీ ప్రభుత్వాల సహకారంతో వ్యవసాయ రంగం అభివృద్ధికి నూతన ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరాన్ని తెలిపారు.
•ప్రస్తుత ప్రాజెక్ట్ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని, తద్వారా తెలంగాణలోని అందరు రైతులు ఈ ప్రయోజనాలను పొందగలుగుతారని తెలిపారు.
•వ్యవసాయ విశ్వవిద్యాలయం & AGHUB డిజిటల్ వ్యవసాయంపై దృష్టి సారించి, తెలంగాణ రైతులను ఆధునిక వ్యవసాయం సాంకేతికతలను వినియోగించే విధంగా ప్రోత్సహించాలన్నారు.
•ప్రస్తుతం రాష్ట్రంలో పండించే పంటలు అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పండించేవిధంగా రైతులను ప్రోత్సహించాలని, దీనివలన ఎగుమతులు పెరిగి రైతులకు అధిక ధరలు పొందుతారని తెలిపారు. దీనికి జర్మనీ ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ అనుబంధ శాఖ, AGHUB, వ్యవసాయ విశ్వవిద్యాలయం కలసి ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి అవకాశాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
•నూతన వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యంత్రాలు ఉపయోగించడం ద్వారా కూలీల కొరతను అధిగమించడమే కాకుండా, అధిక దిగుబడులు రైతులు పొందే విధంగా సాంకేతికతను అనుసంధానం చేయాలన్నారు.

•ప్రస్తుతం దేశంలో జర్మన్ సహకారంతో రాజస్థాన్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్ట్ లు ప్రగతిలో ఉన్నాయని బృంద సభ్యులు వివరించగా, తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక అధ్యయన బృందాన్ని ఈ రాష్ట్రాలకు పంపి వాటియొక్క ఫలితాలను అధ్యయనం చేసి తెలంగాణ రైతులను కూడా అక్కడికి పంపించి వారికి శిక్షణ ఇచ్చి, పంట ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేసి, ఎగుమతి చేసే విధంగా చూడలన్నారు.
•PJTAU, AgHub వంటి సంస్థలు, డిజిటల్ వ్యవసాయాన్ని తెలంగాణ రైతులకు అందించేందుకు ప్రముఖంగా పనిచేయలన్నారు.
• ACRAT ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైతులకు అధునాతన వ్యవసాయ విధానాల ప్రయోజనాలు అందించేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని మంత్రి తెలిపారు.
•Fraunhofer బృందంతో రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ మరియు యూనివర్సిటీలు మరింత సమిష్టిగా పనిచేయాలన్నారు.
•AI మరియు IoT వంటి సాంకేతికతలను ఉపయోగించి అధిక దిగుబడి, ఆహార ప్రాసెసింగ్, మార్కెట్ లింకేజెస్ వంటి అంశాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
•ACRAT ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన అనుభవాలను విస్తృతంగా చేసేందుకు వ్యవసాయ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.
•BMEL ప్రతినిధులు, తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్, అంతర్జాతీయ మార్కెట్ లింకేజెస్ వంటి రంగాల్లో మరింత సహకారం అందిస్తామన్నారు.
•ఈ సమావేశం ఇండో-జర్మన్ వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు, తెలంగాణలో స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి దోహదపడే కీలక ముందడుగు అని తెలుపుతూ, సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా చేయాలని మంత్రిగారు పేర్కొన్నారు.
Leave Your Comments