వార్తలు

బయట కూరగాయలు కొని దాదాపు ఐదేళ్లవుతుందంట..

0

కేరళలోని కొక్కాదవ్ గ్రామంలోని చెరుపులా – తిరుమేని రహదారికి సమీపంలో ఉండే జోషి మాధ్యు ఇళ్లు పచ్చని చెట్ల మధ్య పర్యావరణహితంగా ఉంటుంది. దాదాపు 80 రకాల కూరగాయలు ఆకుకూరల పంటలను పండిస్తున్నారు జూలీ, అందుకే మార్కెట్ లో కూరగాయల ధరలు తెలియవని అంటున్నారు. ఎందుకంటే బయట కూరగాయలు కొని దాదాపు ఐదేళ్లవుతుందంట. బియ్యం, గోధుమలు మినహా అన్ని ఇంట్లోనే పెంచుకుంటున్నారు. వారు గత 50 ఏళ్ల నాటి ఎరుపురంగు లాటరైట్ పెంకులతో కట్టిన ఇంట్లో ఉంటున్నారు. ఇది బయటి ఉష్ణోగ్రత కంటే లోపల చాలా చల్లగా ఉంటుంది. అందుకే ఈ దంపతులకు ఆ ఊరిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జోషి వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. మొదట్లో కూరగాయల సాగు కష్టతరం అనుకున్న జోషి, అతని స్నేహితుడు విజయవంతంగా చేసిన సాగును చూసి అతడికి నచ్చింది. అతను ఫేస్ బుక్ లోని నిపుణుల సలహా, సూచనలు తీసుకున్నాడు. అది అతడికి ఎంతో ఉపయోగం కలిగిందట.
వారికి ఉన్న 25 సెంట్ల భూమిలో చేపలు, తేనెటీగల పెంపకం చేస్తున్నారు. అది కూడా అంతా సేంద్రియ పద్దతిలోనే. అలాగే కోళ్ల పెంపకం, ఆవు కూడా ఉంది. వారి ఆవరణలోనే రెండు చిన్న పాండ్ లను కట్టారు. అందులో 800 చేపలు పెంచుతున్నారు. ఇవి ఆ పాండ్ లో నాచుని తింటాయి. ఇందులో జెయింట్ గౌరమి, రెడ్ టిలాపియా, అసోంవాలా వంటి రకాల చేపలు ఉన్నాయి. మొదట కేవలం వారికోసమే చేపల పెంపకం మొదలుపెట్టారు. లాక్ డౌన్ సమయంలో మార్కెట్లు అన్ని బ్యాండ్ ఉండటంతో వారు చేపల అమ్మకం కూడా మొదలు పెట్టారు. దాదాపు 3000 చేపలను రూ.10 ఒక పీస్ చొప్పున విక్రయించారు. ఈ విధంగా వారికి ఆదాయం కూడా వచ్చింది. వారు మొక్కలకు నీరు పెట్టె విధానం అయితే మరో అద్భుతం. ఈ ప్రక్రియను మలయాళంలో “తిరి నానా” అని పిలుస్తారంట. ఒక బకెట్ లో నీటిని నింపి, దానిపై ఒక ట్రేను కప్పుతారు. ట్రేలో చిన్న రంధ్రం చేసి,తాడు చివరకు కలుపుతారు. మరొక చివర ట్రే పైన పెట్టిన గ్రో బ్యాగుల గుండా వెళుతుంది. ఈ పద్ధతితో మొక్కలకు నీరు అందుతూ ఉంటుంది. దీనివల్ల సమయం, నీరు వృథా కాదు. వారానికి రెండుమార్లు బకెట్ ను నింపుతారు.
జూలీ మొదట్లో రెండు మూడు మొక్కలు నాడటంతో మంచి ఫలితం రావడంతో వాటిని మరింత అభివృద్ధి చేసింది. విత్తనాల కోసం స్థానిక రైతులను కలిశారు. వారి నుంచి ఒక ఆవును కొన్నారు. సేంద్రియ పద్దతిలో తయారు చేస్తుంది. జూలీ కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు, వేప పేస్టు, ఆవుపేడతో కంపోస్టు తయారు చేసి మొక్కలకు ఉపయోగిస్తున్నారు. సేంద్రియ పంట రుచి చూశాక వారికి బయట కూరగాయలు రుచించటం లేదట.
ఆ ఇంటికి మరో ఆకర్షణ తేనెటీగల పెంపకం. ఏడాదికి దాదాపు 20 కిలోల తేనె లభిస్తుంది. 80 తేనెతుట్టెలను పెంచారు. దీనివల్ల రూ. 80 వేల ఆదాయం లభించిందని చెబుతాడు జోషి. మొదట బంధువులు,స్నేహితులకు స్నేహితులకే కూరగాయలు ఇచ్చే వాళ్ళు, కరోనా వల్ల వ్యాపారం వైపు బాటలు వేయాల్సి వచ్చిందని జూలీ అన్నారు.

Leave Your Comments

పీఎం కిసాన్ యోజన పథకంలో ఉన్నవారికి మరికొన్ని సేవలు..

Previous article

కాలుష్యాన్ని తగ్గించే మొక్క.. కోటోనేస్టర్ మొక్క

Next article

You may also like